బొల్లాపల్లి మండలంలోని మూగ చింతలపాలెం గ్రామంలో మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో కిశోర దశ బాలికలకు కిషోర్ వికాసం -వేసవి సెలవులు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓపి అరుణ మాట్లాడుతూ కౌమార దశ బాలికలకు, వ్యక్తిగత శుభ్రత పట్ల, రక్తహీనత పట్ల, బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన పోస్కో చట్టం పట్ల, లింగ వివక్ష పట్ల, ఉన్నత ఆలోచనలు కలిగి ఉండడం, బాల్య వివాహాల గురించి అవగాహన కలిగించారు.