బొల్లాపల్లి గ్రామంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శుక్రవారం పార్క్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు మాట్లాడుతూ, ఈ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన అన్నారు. ఈ పార్క్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.