బొల్లాపల్లి మండలం వెల్లటూరులో బుధవారం నాడు ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు ముటుకులకు చెందిన మూర బోయిన అనంతరాము (వయసు 23)గా గుర్తించారు. వినుకొండ వెళ్తున్న ట్రాక్టర్ కొండ దిగాక ఎదురు వాహనం రావడంతో దిక్కుతెలియక ఎన్ఎస్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.