ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు, రిటైర్డ్ డి.ఐ.జి చంద్రగిరి ఏసురత్నంని గుంటూరులోని వారి స్వగృహంలో గురువారం చిత్తూరు జిల్లా వడ్డెర యువ నాయకుడు డాక్టర్.యం.డి.హెచ్. పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డెర జాతి అభివృద్ధి కోసం వడ్డెర కులస్తులను యస్.టి జాబితాలో చేర్చాలని ఆయన విన్నవించారు. స్పందించిన ఏసురత్నం, వడ్డెర జాతికి న్యాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుండి వడ్డెర గొంతుకను శాసనమండలిలో వినిపిస్తానన్నారు.