నాటు సారాయి, గంజాయి, డ్రగ్స్ బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. నవోదయ-2 కార్యక్రమంలో భాగంగా శనివారం ఈపూరులో ఎక్సైజ్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అంటూ ప్రజలకు సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలై తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దు అన్నారు.