వినుకొండ పట్టణంలో కస్తూర్బా గాంధీ బాలికల వసతి భవనం (2. 50 కోట్ల రూపాయలు) నిర్మాణానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ లావు మాట్లాడుతూ, బాలికల విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ నూతన వసతి భవనం బాలికలకు సౌకర్యవంతమైన విద్యను అందించడానికి దోహదపడుతుందని తెలిపారు.