ఈపూరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు అదేశాల మేరకు స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల్లో ఎక్సైజ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని వీరాంజనేయ వైన్స్ లో రసాయన పరీక్షల నిమిత్తం మద్యం సీసాలను సేకరించి సీల్ వేశారు. మద్యం ఏమ్మార్పీ ధరలకు విక్రయించాలని, నిబంధనల మేరకు అమ్మకాలు నిర్వహించాలని ఆదేశించారు.