వినుకొండ కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 366 కేసులు పరిష్కరించగా, బాధితులకు 76 లక్షల రూపాయలు అందజేశారు. ఈ విషయాన్ని లోక్ అదాలత్ ఛైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహతి తెలిపారు. ప్రతి మూడు నెలలకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సహకరించిన న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.