వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రంగనాయక స్వామి వారిని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల ఆశీర్వాదం పొందారు. అనంతరం అక్కడ ఉన్న భక్తులకు తీర్థప్రసాదాలు స్వయంగా అందజేశారు.