వినుకొండలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని 63 మందికి రూ. 58 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బాధిత కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని జీవీ అన్నారు.