వినుకొండలో శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అధికారులందరూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు, ఎమ్మెల్యే జీవి, నాయకులు పాల్గొన్నారు.