బొల్లాపల్లి మండల కేంద్రమైన బొల్లాపల్లి లో పాడి రైతులకు 50 శాతం సబ్సిడీతో పశువుల దాణాను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాణాలో 25 శాతం మాంసకృత్తులు ఉంటాయని, వేసవిలో వీటి ద్వారా పాల దిగుబడి, వెన్న శాతం తగ్గకుండా ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.