వినుకొండలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీవి ఆంజనేయులు ఆదేశాలు మేరకు గత వారం రోజులుగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పండగ తిరుణాల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భక్తులు వేకువజాము నుండి స్వయంగా శ్రీరామచంద్రుడు ప్రతిష్టించిన శివలింగానికి పూజలు చేసి ముక్కులు తీర్చు కొనేందుకు బారులు తిరారు.