వినుకొండ: కొండపైకి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు

0చూసినవారు
వినుకొండ: కొండపైకి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు
కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత రామలింగేశ్వరస్వామి వారి తిరునాళ్ల వేడుకలు ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో ప్రయాణించి కొండపైకి చేరుకునే భక్తుల కోసం 40 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ జవ్వాజి నాగేశ్వరరావు శనివారం తెలిపారు. బస్సులు తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, టికెట్ ధర పెద్ద లకు  రూ.40,  రూ. పిల్లలకు 20 నిర్ణయించినట్లు డిఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్