ఈపూరు మండలం కొచ్చెర్లలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటనలో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ అభిమానులు, కార్యకర్తలను గురువారం వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.