AP: గురుకుల ప్రవేశపరీక్ష-2025 ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు. 5వ తరగతిలో 15,020 సీట్లకు గాను 32,823 మంది, ఇంటర్లో 13,680 సీట్లకు గాను 32,733 మంది విద్యార్థులు గత నెల 13న పరీక్షలు రాశారు. 5వ తరగతి ఫలితాల్లో కడవల సుమతి (కర్నూలు) మొదటి ర్యాంక్ సాధించారు. ఇంటర్ ఫలితాల్లో రఘుపతి గీతిక (విశాఖ) మొదటి ర్యాంక్ సాధించారు.