మహా కుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే మంగళవారం మహా కుంభమేళాకు ఓ ప్రత్యేక సందర్శకుడు వచ్చాడు. అతడే అతి పిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించిన హేయాన్ష్ యాదవ్. ఈ ఆరేళ్ల సాహసికుడు కుంభమేళాలో వివిధ భంగిమల్లో యోగా చేస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు. హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన హేయాన్ష్ 2022లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించాడు.