AP: తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మంత్రి నారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను మూడు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.