AP: మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. గ్రూప్-1 అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీలుగా పీఎస్ఆర్, మధు జైలులో ఉన్నారు. వారి తరపున హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మసనం.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులను పీఎస్ఆర్ అనుకూలంగా పని చేశారనే ఆరోపణలున్నాయి.