ఏపీ మాజీ మంత్రి విడదల రజిని దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు మంగళవారం విచారించనుంది. ఇటీవల విడదల రజినిపై చిలుకలూరిపేటలోని పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను హైకోర్టు నేడు విచారించనుంది.