ఏపీలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షాలు కురవడంతో ఉపశమనం కలిగింది. శనివారం అనంతపురం, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నుండి 14వ తేదీ వరకు గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.