ఏపీలో భారీ వర్షాలు.. నిలిచిన రాకపోకలు

77చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. నిలిచిన రాకపోకలు
అల్పపీడనం ప్రభావంతో ఆదివారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాలు వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వంశధార నదికి వరద ప్రవాహం పెరిగింది. ఈ మేరకు శ్రీకాకుళం నరసన్నపేట మండలంలోని గడ్డవానిపేట, కొబగాం గ్రామాలకు అధికారులకు అప్రమత్తం చేశారు. చిక్కాలవలస అండర్ పాస్ రైల్వే వంతెన వద్ద వరద పెరిగింది. దీంతో 20కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్