దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో వరదల ధాటికి పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో హరిద్వార్లో వర్షం నీరు వరదలా మారి రోడ్డుపై ఉదృతంగా ప్రవహించింది. దీంతో నది ఒడ్డున నిలిపి ఉంచిన ఓ భారీ ట్రక్కు వరద ధాటికి కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.