AP: పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులు, కాలువల పనులకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పాల్గొన్నారు. ఆనాడు ఆంగ్లేయుడైన మహానుభావుడు ఆర్ధర్ కాటన్ ముందు చూపుతో ధవలేశ్వరం ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు కృషి చేశాడని తెలిపారు.