రెండు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు

51చూసినవారు
రెండు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
ఏపీలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. అయితే అల్లూరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దినేష్ ఉత్తర్వులిచ్చారు. అలాగే ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు మంగళవారం అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్