ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని అన్ని స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వలు జారీ చేశారు. స్కూల్స్ నడిపిన వారిపై కఠినమైన చర్యలు కూడా ఉంటాయని తెలిపారు.