ఉత్తరప్రదేశ్ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో కొందరు పోకిరీలు రోడ్డుపై వర్షపు నీటిలో ఆడుకుంటున్నారు. ఇంతలో భార్యాభర్తలు బైక్పై ఇంటికి వెళ్తుండగా పోకిరీలు వారిపై నీళ్లు చల్లి దురుసుగా ప్రవర్తించడంతో బైకు ఒరిగి మహిళ పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.