ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనకు ఇచ్చిన ఆఫర్పై బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా కంటే ముందు అధికారంలో ఉన్న వారు ఎలాంటి అభివృద్ధి చేశారు? అప్పుడు స్త్రీల పరిస్థితి ఎలా ఉండేది? సూర్యాస్తమయం తర్వాత ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడేవారు. నేను అలాంటి వారితో పొత్తు పెట్టుకొని తప్పు చేశా’ అని నీతీశ్ తెలిపారు.