బీజేపీ నేత రమేష్ బిధూరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిధూరి ఆదివారం కల్కాజీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్గా చేస్తానన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే ఖండించారు. బీజేపీ అసలు రూపం ఇదే అని మండిపడ్డారు.