AP: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలే టార్గెట్గా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో అక్రమ మైనింగ్పై కూడా పోరాటం చేస్తామన్నారు.