తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 59,784 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.