భారత్ 6జీ టెక్నాలజీలో ముందడుగు వేసింది. ప్రపంచంలో 6జీ పేటెంట్ల దాఖలులో టాప్-6 దేశాల్లో చోటు దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన ‘భారత్ 6జీ 2025’ సదస్సులో సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు 111 పరిశోధనలకు రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 6జీ టెక్నాలజీ 5జీ కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని తెలిపారు.