భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందం గడువు మే 18న ముగియనుంది. ఈ క్రమంలో ఆదివారం మరోసారి భారత్-పాక్ DGMOల మధ్య కీలక సమావేశం జరగనుంది. సీజ్ ఫైర్ కొనసాగింపుపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. సింధూ జలాల ఒప్పందంపై చర్చించాలని పాక్ పట్టుబట్టనుందని తెలుస్తోంది. ఉగ్రవాదం, POKపైనే చర్చలుంటాయని భారత్ తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల DGMOల భేటీలో ఏం జరగనుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.