రేపటితో భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పొందం గడువు ముగియనుంది. ఈ క్రమంలో రేపు మరోసారి భారత్-పాక్ DGMOల మధ్య కీలక సమావేశం జరగనుంది. సీజ్ ఫైర్ కొనసాగింపుపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. సింధూ జలాల ఒప్పందంపై చర్చించాలని పాక్ పట్టుబట్టనుందని తెలుస్తోంది. ఉగ్రవాదం, POKపైనే చర్చలుంటాయని భారత్ పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే.