భారత్, పాకిస్థాన్ మధ్య వైరం అంత మంచికాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని ట్రంప్ వెల్లడించారు. గల్ఫ్ పర్యటన ముగించుకొని వాషింగ్టన్ చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఆమెరికా వల్లే సాధ్యమైందని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.