భారత్-పాక్ యుద్ధం.. తిరుమలలో భద్రత కట్టుదిట్టం

76చూసినవారు
భారత్-పాక్ యుద్ధం.. తిరుమలలో భద్రత కట్టుదిట్టం
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయానికి అదనపు భద్రతా బలగాలను కేటాయించారు. కొండపై భక్తుల సంచారం అధికంగా ఉండే ప్రదేశాలను నిఘా వర్గాలు గుర్తించాయి. వాటి సూచనలతో ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం సాయంత్రం, శనివారం అన్నదాన సముదాయంలో మాక్ డ్రిల్, ఆలయ మాడవీధుల్లో భద్రతా సిబ్బందితో కవాతు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్