'భారతి సిమెంట్ పరిశ్రమ మైనింగ్ పేలుళ్ల ఘటనపై చర్యలు తీసుకోండి'

51చూసినవారు
'భారతి సిమెంట్ పరిశ్రమ మైనింగ్ పేలుళ్ల ఘటనపై చర్యలు తీసుకోండి'
TG: భారతి సిమెంట్ పరిశ్రమ మైనింగ్ పేలుళ్ల వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం టి. సుంకేసుల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కడప కలెక్టరేట్లో జేసీ అదితిసింగ్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గతంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, గత నెల 20న వచ్చి పరిశీలించారని బాధితులు తెలిపారు. గ్రామంలో శాశ్వతంగా మైనింగ్ బ్లాస్టింగ్ టెస్టింగ్ పరికరాలు అమర్చుతామని చెప్పి ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్