భారత్ - ఇంగ్లాండ్ మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్లో జరుగుతుండగా, రెండో మ్యాచ్ ఒడిశాలోని కటక్ వేదికగా జరుగుతుంది. అయితే, రెండో వన్డే ఆఫ్ లైన్ టికెట్ల కోసం కటక్ స్టేడియం దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేయడం కష్టంగా మారి.. పోలీసులు వాటర్ గన్స్ ప్రయోగించాల్సి వచ్చింది.