తిరుమలకు వచ్చే భక్తుల ఇబ్బందులను తొలగించడానికి టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రూ.500 కోట్లతో ఇంట్రా మోడల్ బస్స్టాప్ను నిర్మించనుంది. అత్యాధునిక సదుపాయాలతో దీనిని నిర్మించనున్నారు. అలాగే అన్ని సౌకర్యాలతో నిర్మాణం చేపట్టనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో బస్టాండ్ను, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, తదితరాలను ఏర్పాటు చేయనున్నారు.