ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఓ విషయం హాట్ టాపిక్గా నడుస్తోంది. మొన్నటివరకు బెంగళూరులో ఉన్న జగన్ గత శనివారం రోజు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలివిడిగా ఉంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా గత శనివారం రాత్రి బెంగళూరులో కాంగ్రెస్ నేతలు కొంతమందికి తన ఇంట్లో జగన్ విందు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అయితే జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు, అందుకే కాంగ్రెస్ నేతలకు దగ్గర అవుతున్నట్లు తెలుస్తోంది.