పాకిస్థాన్ గూఢచారులకు స్పైగా పనిచేస్తున్న ఆరోపణలతో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 'Travel with Jo' ఛానల్ నడిపే జ్యోతి, 2023లో కమీషన్ ఏజెంట్ల ద్వారా పాకిస్థాన్ వెళ్లి, అక్కడ పాక్ హైకమిషన్లోని ఎహ్సాన్-ఉర్-రహీమ్ (దానిష్)తో సన్నిహితంగా ఉన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్లలో "జట్ రంధావా"గా సేవ్ చేసిన శాకిర్ (రాణా షహబాజ్) అనే పాక్ గుఢచారితో టచ్లో ఉన్నట్లు సమాచారం.