సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం కరెక్ట్ కాదు: రోజా

83చూసినవారు
సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం కరెక్ట్ కాదు: రోజా
AP: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ ఎస్వీ గోశాల వ్యవహారం పై స్పందించారు. టీడీపీ నేతల సవాల్‌కి భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారని, కానీ గోశాల వద్దకు ఆయనను అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా? అని ఆమె ప్రశ్నించారు. సవాల్ విసిరిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని రోజా మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్