టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టై సోమవారం నాటికి సరిగ్గా ఏడాది. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మోపిన అక్రమ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 9న ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు. 53 రోజులు జైల్లో ఉన్న అనంతరం చంద్రబాబు బెయిల్పై విడుదల అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో అక్రమాలు జరిగాయన్న అభియోగంతో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించింది. ఆరోగ్య కారణాలతో పాటు ఈ కేసులో బలమైన సాక్ష్యాలు చూపలేకపోవడంతో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జైలువాసం గడపడం ఇదే తొలిసారి.