టీడీపీ నేతలకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలో వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయిన జగన్ తనను ఈసారి 2.0గా చూడబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలను వేధిస్తే ఏం చేస్తానో త్వరలోనే చూపిస్తానని కూటమి నేతలను హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు పెడతానని, చట్టం ముందు నిలబెడతానని ఆగ్రహం వ్యక్తం చేశారు.