AP: హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ సొంతం చేసుకోవడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. 'హిందూపురంలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో వైసీపీకి బలం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరించి.. ప్రలోభాలకు గురి చేసి వైసీపీ కౌన్సిలర్లను లాక్కున్నారు. బాలకృష్ణకు సిగ్గుండాలి. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ గెలుపు.. అసలు గెలుపే కాదు' అని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.