AP: జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బీజేపీకి దత్త పుత్రుడని, చంద్రబాబుది బీజేపీతో అధికారిక పొత్తు అయితే.. జగన్ది అక్రమ పొత్తు అంటూ మాట్లాడారు. బీజేపీ మీద చంద్రబాబు, జగన్ ఈగ కూడా వాలకుండా చేస్తారని, రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన ప్రశ్నించే ధైర్యం వారిద్దరికి లేదంటూ ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించేది కేవలం కాంగ్రెస్ పార్టీనేనంటూ పేర్కొన్నారు.