గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి, 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో పొలిటికల్ అడ్వైజరీ నూతన కమిటీని ప్రకటించారు. సజ్జల రామకృష్ణారెడ్డికు పీఏపీ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో ఘోర పరాజయానికి సజ్జలే కారణమని అనేక మంది నేతలు బహిరంగంగానే కామెంట్ చేయగా, ఎవరి కారణంగా పార్టీకి నష్టం జరిగిందో వారినే మళ్లీ నియమించారంటూ తాజాగా పలువురు మరోసారి పోస్టులు పెడుతున్నారు.