వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి జగన్ షాక్ ఇవ్వనున్నారు. 2024 ఎన్నికల్లో వంశీ ఓటమి తర్వాత నియోజకవర్గం వీడారు. ఇప్పుడు గన్నవరంకు వైసీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీకీ ప్రత్యామ్నాయం దొరికినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాజీ పీసీసీ ఉఫాధ్యక్షురాలు పద్మశ్రీ వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి జగన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆమె వైసీపీలో చేరి గన్నవరం ఇన్ఛార్జ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.