మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంతకాలం జగన్ కుట్రలు సాగవని అన్నారు. శాంతిభద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని జగన్ కుట్రలు చేస్తున్నారని, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం జగన్కే చెల్లిందంటూ ఆరోపించారు.