కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. పొగాకు రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ను రంగంలోకి దించి మద్దతు ధర అందించాలని సూచించారు. పొగాకు రైతుకు కనీసం కేజీకి రూ.280 అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.